MLA బత్తుల లక్ష్మారెడ్డి ఆధ్వర్యంలో, రాష్ట్ర నాయకులు స్కైలాబ్ నాయక్ సమక్షంలో కాంగ్రెస్ శ్రేణులు భారీ నిరసన ర్యాలీ
ప్రజాలహరి మిర్యాలగూడ; మిర్యాలగూడ నియోజకవర్గ MLA బత్తుల లక్ష్మారెడ్డి ఆధ్వర్యంలో, రాష్ట్ర నాయకులు స్కైలాబ్ నాయక్ సమక్షంలో కాంగ్రెస్ శ్రేణులు భారీ నిరసన ర్యాలీ చేపట్టారు. కేంద్ర ప్రభుత్వ నిరంకుశ పోకడలకు వ్యతిరేకంగా, ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు కాంగ్రెస్ కార్యకర్తలు రోడ్లపైకి వచ్చారు. రాహుల్ గాంధీ అంటే గర్జించే సింహం అని ఆయన గొంతు నొక్కాలని చూస్తే… కోట్లాది కాంగ్రెస్ కార్యకర్తల గొంతులు వినిపిస్తాయిఅని MLA బత్తుల లక్ష్మారెడ్డి , రాష్ట్ర నాయకులు స్కైలాబ్ నాయక్ ఆధ్వర్యంలో నేడు భారీ ర్యాలీ నిర్వహించి నిరంకుశత్వానికి వ్యతిరేకంగా నిప్పులు చెరిగారు. రాహుల్ గాంధీని అరెస్ట్ చేయడం దుర్మార్గం రాహుల్ గాంధీ పై జరుగుతున్న కుట్రలను ఖండిస్తూMLA బత్తుల లక్ష్మారెడ్డిరాష్ట్ర నాయకులు స్కైలాబ్ నాయక్ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ.



