వర్షపు నీటి పై అవగాహన కార్యక్రమాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే బిఎల్ఆర్
“క్యాచ్ ది రైన్” కార్యక్రమాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి – BLR. ఈరోజు మిర్యాలగూడ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో “Catch the Rain – Rain Water Harvesting Campaign” కార్యక్రమాన్ని మిర్యాలగూడ శాసనసభ్యులు *బత్తుల లక్ష్మారెడ్డి – BLR* గారు, మున్సిపల్ కమిషనర్ గారితో కలిసి ప్రారంభించారు… ఈ సందర్భంగా వర్షపు నీటి సంరక్షణపై రూపొందించిన అవగాహన పోస్టర్ను ఆవిష్కరించి ప్రజలకు కార్యక్రమం యొక్క ప్రాముఖ్యతను వివరించారు. అనంతరం ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి -BLR గారు, మున్సిపల్ కమిషనర్ గారు, అధికారులు కలిసి *వర్షపు నీటి సంరక్షణ, భూగర్భ జలాల పరిరక్షణకు కట్టుబడి పనిచేస్తామని ప్రతిజ్ఞ చేశారు..
ఈ సందర్భంగా ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి గారు మాట్లాడుతూ, వర్షపు నీటిని వృథా కాకుండా ప్రతి ఇంటిలో **రైన్ వాటర్ హార్వెస్టింగ్** వ్యవస్థలను ఏర్పాటు చేసుకోవడం ద్వారా భూగర్భ జలాలను పెంపొందించడంతో పాటు భవిష్యత్తులో నీటి కొరతను నివారించవచ్చన్నారు. ప్రతి పౌరుడు నీటి సంరక్షణను సామాజిక బాధ్యతగా భావించి ఈ కార్యక్రమంలో భాగస్వామి కావాలని పిలుపునిచ్చారు… రైన్ వాటర్ హార్వెస్టింగ్ వల్ల కలిగే ప్రయోజనాలు: భూగర్భ జలాల మట్టం పెరుగుతుంది. వేసవిలో నీటి కొరతను తగ్గించవచ్చు. వ్యవసాయానికి నీటి లభ్యత మెరుగుపడుతుంది. పర్యావరణ పరిరక్షణకు దోహదపడుతుంది. భావితరాలకు నీటి వనరులను సంరక్షించవచ్చు. పౌరులు పాటించాల్సిన సూచనలు: ఇంటి పైకప్పులను పరిశుభ్రంగా ఉంచాలి. ఫిల్టర్లను క్రమం తప్పకుండా శుభ్రం చేయాలి. నిల్వ ట్యాంకులను నిర్వహించాలి. ప్రతి ఇంటిలో రీచార్జ్ పిట్ లేదా రైన్ వాటర్ హార్వెస్టింగ్ వ్యవస్థను ఏర్పాటు చేయాలి. ఈ కార్యక్రమం ద్వారా మిర్యాలగూడ మున్సిపాలిటీ పట్టణ ప్రజల్లో వర్షపు నీటి సంరక్షణపై విస్తృత అవగాహన కల్పిస్తూ, “ప్రతి నీటి చుక్కను ఒడిసిపట్టుదాం – భవిష్యత్ తరాలకు జల భద్రతను అందిద్దాం” అనే సందేశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తోంది అని అన్నారు.. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజా ప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు..



