నైతిక విజయం మనదే మాజీ ఎమ్మెల్యే భాస్కరరావు
ఓటమి తాత్కాలికమే.. కార్యకర్తలకు అండగా ఉంటాం: మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు గారు..
మిర్యాలగూడ టౌన్ ప్రజాలహరి
15వ, 17వ వార్డుల బిఆర్ఎస్ పార్టీ బలపరిచిన సిపిఎం అభ్యర్థులను పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు గారు..
*నైతిక విజయం మనదేనని అభ్యర్థుల్లో ధైర్యం నింపిన నేత.
ప్రజా సమస్యలపై నిరంతరం పోరాడాలని పిలుపు.
ఈరోజు మిర్యాలగూడ నియోజకవర్గ పరిధిలోని మిర్యాలగూడ టౌన్ 15వ వార్డు మరియు 17వ వార్డు బిఆర్ఎస్ పార్టీ బలపరిచిన సిపిఎం కౌన్సిలర్ అభ్యర్థులుగా పోటీ చేసి, స్వల్ప ఓట్లతో ఓటమి పాలైన అభ్యర్థుల నివాసాలకు మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు గారు స్వయంగా వెళ్లారు. ఈ సందర్భంగా ఆయన అభ్యర్థులను, వారి కుటుంబ సభ్యులను పరామర్శించి వారికి పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.
అభ్యర్థులతో మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు గారు మాట్లాడుతూ:
“ఎన్నికల్లో గెలుపోటములు సహజం. కేవలం కొన్ని సాంకేతిక కారణాల వల్ల, స్వల్ప ఓట్ల తేడాతో మనం వెనుకబడ్డామే తప్ప, ప్రజల్లో మన పట్ల ఆదరణ తగ్గలేదు. అభ్యర్థులు అధైర్యపడాల్సిన అవసరం లేదు. ప్రజల కోసం మీరు చేసిన కృషి వృధా పోదు.”
కార్యకర్తలకు దిశానిర్దేశం:
వార్డుల్లోని పార్టీ కార్యకర్తలతో మాట్లాడిన ఆయన, ఫలితాలతో సంబంధం లేకుండా ప్రజల మధ్యే ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని సూచించారు. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ, బిఆర్ఎస్ పార్టీ హయాంలో జరిగిన అభివృద్ధిని ప్రజల్లోకి తీసుకెళ్లాలని కోరారు. రాబోయే రోజుల్లో పార్టీని మరింత బలోపేతం చేస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో స్థానిక బిఆర్ఎస్ నాయకులు, ముఖ్య కార్యకర్తలు మరియు అనుబంధ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.



